Showing posts with label అన్యాయం. Show all posts
Showing posts with label అన్యాయం. Show all posts

కడుపు మండమంటే మండదా?

'తెలంగాణా' ప్రత్యేక రాష్ట్రంగా చేయడానికి మేమంటే మేమని సంతకాలతో సహా ముందుకొచ్చారే? ఇప్పుడేమో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తూ తమ తమ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా 'సమైక్యాంధ్ర' జపం చేస్తున్న ఈ రాజకీయులను చూసి ఏ తెలంగాణా వాడి కడుపు మండదు.

ఒక 'లగడపాటి', ఒక 'కె.సి.ఆర్.' - వీరికి ఉన్న నిబద్ధత ముందు మిగతా రాజకీయులంతా బలాదూర్.గోడ మీద పిల్లి వాటం వలె 'బాబు',తెలంగాణా కు ఓకె అంటూ ఓట్లడుక్కొని ఇప్పుడు ఇలా చేయడం అన్యాయం అని ఒక్కరికీ అనిపించలేదా. తెరాసకు ఓట్లు రాలేదు సరే కానీ 'సమైక్యాంధ్ర' అని ఓట్లు అడుక్కొన్న ధీరుడొక్కడైనా ఉన్నాడా ఈ శిఖండుల్లో...చివరికి మా చిరంజీవి కూడా...ఎంత దుర్మార్గం.

అవన్నీ సరే కానీ మన తెలుగు బ్లాగు 'సమైక్యవాదుల'కు ఓ సూటి ప్రశ్న సంధించారు ఆనందిని'సంతోష్ కుమార్' గారు...
"ఇదేమిటి?...ఇగ్నోర్‌ చేయవద్దు.. జవాబు ఇవ్వండి"
http://kovela.blogspot.com/2009/12/blog-post_19.html
చదువరి గారిని, శరత్ గారిని, తాలబాసు గారిని, అబ్రకదబ్ర గారిని, వంశీ గారిని,సుజాత గారిని దీనికి సమాధానం ఇవ్వాలని నేను వినమ్రంగా అడుగుతున్నాను.