ఈ ప్రశ్నకు మీ సమాధానమేమిటి?

భారతదేశ రాష్ట్రపతి "అవుల్. ఫకీర్. జైనులాబ్దీన్. అబ్దుల్ కలాం" గారి ఈ ప్రశ్నకు -

'మన భూమండలాన్ని తీవ్రవాదం నుంచి విముక్తి చేయడానికి మనం ఏం చేయాలి?'

"మానవ సమాజం పుట్టుక నుంచి నేటి వరకు భిన్న వర్గాల మధ్య, ఒకే వర్గంలో అంతర్గతంగానూ యుద్ధం జరుగుతూనే ఉంది. ఇదే రెండు ప్రపంచ యుద్ధాలకు కారణమైంది. ఇప్పుడు కూడా తీవ్రవాదం, గెరిల్లా యుద్ధాలు మన ప్రపంచంలో చాలా చోట్ల చిచ్చు రేపుతూనే ఉన్నాయి.ప్రపంచ జనాభా ప్రస్తుతం ఉన్న 600కోట్ల నుంచి 2025కల్లా 800కోట్లవుతున్న దశలో జాతీయ, అంతర్జాతీయ సంఘర్షణలు దైనందిన మానవజీవితంలో అత్యంత ప్రభావం చూపుతాయి. దుష్టబుద్ధులు ఏకమవుతున్న ఈ తరుణంలో, మంచివారు తమ మెదడుకు పదును పెట్టి వారినుండి కాచుకోవాలి. ఈ నేపథ్యంలో వినూత్నమైన పరిష్కారాన్ని సూచించండి. మీ సమాధానాలు ఓ క్రమపద్ధతిలో విశ్లేషించి అమలుపరచబడితే శాంతియుతమైన, సౌఖ్యమైన, సురక్షితమైన పృథ్వి మనకు దక్కుతుంది."

ఇది ఆయన మాటల్లోనే విని, చూసి మీ బదులివ్వండి ఇక్కడ .

No comments: